ఫిదా సినిమాతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన ముద్దుగుమ్మ సాయిపల్లవి తర్వాత నటించే చిత్రం మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసీఏ). న్యాచురల్ స్టార్ నానికి జోడిగా నటిస్తోంది. నాని నటన సహజంగా ఉంటుంది. నటనకు ఏ వంక పెట్టలేం. సాయిపల్లవికి కూడా అంతే. వీరిద్దరూ కలిసి నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ డిసెంబర్ నెలలో నానిపై చాలా ఆశలు ఉన్నాయి.
అయితే నాని, సాయిపల్లవి మధ్య నటనపరంగా పోటీ ఏర్పడిందంట. నాని కన్నా సాయిపల్లవి హైలెట్గా నిలుస్తుందని ఆమె పాత్రను తగ్గించారని టాక్ వినిపిస్తోంది. నానిని డామినేట్ చేసే విధంగా సాయిపల్లవి క్యారెక్టర్ ఉందని భావించి సెన్సార్ బోర్డులో సాయిపల్లవి పాత్రపై కత్తెర పడిందంట. అయితే ఈ విషయం సాయిపల్లవి అభిమానులను నిరాశ పరిచే విషయమే. ఎందుకంటే ఫిదా సినిమాను చూసిన తర్వాత సాయిపల్లవి పాత్ర తక్కువగా ఉంటే ప్రేక్షకులు ఊహించలేరు. ఆమె పాత్ర, నటనకు తక్కువ ప్రాధాన్యం ఉంటే సహించని పరిస్థితి ఏర్పడింది.
అయితే ఎంసీఏ సినిమాలో సాయిపల్లవి కన్నా వదిన పాత్ర చేస్తున్న భూమికకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని టాక్. ఆ సినిమా మొత్తం వదిన, మరిది మధ్య ఉండనుందని ఆ చిత్ర నిర్మాత దిల్రాజు ప్రకటించారు. భూమిక పాత్ర ఎక్కువ ఉండి సాయిపల్లవి పాత్ర తక్కువగా ఉంటే మాత్రం ప్రేక్షకులు ఆహ్వానించలేని పరిస్థితి. ట్రైలర్లో కూడా సాయిపల్లవి పాత్ర తక్కువగా ఉన్నట్టే కనిపించింది. ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీన విడుదలవుతోంది.