బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతికి బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ వార్ జరగనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఇదే క్రిస్మస్కు షారుఖ్ నటించిన డంకీ కూడా రిలీజ్ కానుందని వార్తలు రావడంతో బాక్సాఫీస్ వార్ షారుఖ్ వర్సెస్ ప్రభాస్గా మారిపోయింది.
అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం షారుఖ్ డంకీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.సలార్కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, డుంకీకి రాజ్కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు.
ఇక బ్యాక్ టూ బ్యాక్ పఠాన్, జవాన్తో వెయ్యి కోట్ల క్లబ్లో చేరారు షారుఖ్. ఈ నేపథ్యంలో రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రభాస్ నటించిన సలార్ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అంటేనే తెలియదు రాజ్కుమార్ హిరానీకి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు ఉంటుందని భావించారు అంతా. అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం డంకీ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది.