Thursday, May 16, 2024
- Advertisement -

యాంకర్ సమీరా పొట్ట కొట్టిన భానుశ్రీ, రవి ?

- Advertisement -

నాగబాబు జబర్ధస్త్ కామెడీ షోకు జడ్జ్‌గా గుడ్ బై చెప్పి జీ తెలుగులో ‘అదిరింది’ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో మరో జడ్జిగా హీరో నవదీప్ ఉన్నారు. ఇప్పటికే ఈ షోకి సంబంధించి చాలా ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. ఈ షో కూడా జబర్దస్త్ అంత కాకున్న పర్వాలేదు అన్న పేరు సంపాధించుకుంది. మాములుగా జబర్దస్త్ షోకి అనసూయ, రష్మీల గ్లామర్ బాగా ఉపయోగపడింది.

ఈ షో ద్వారా అనసూయ, రష్మీ హీరోయిన్స్ కంటే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతేకాకుండా షో మొదలు అయ్యే ముందు వీరు ఓ పాటతో తమ గ్లామర్‌ చూపిస్తూ షో మొదలు పెడుతారు. ఇక ‘అదిరింది’ విషయంకు వస్తే.. సమీరా ఇన్ని రోజులు తన మాటలతో అందర్ని ఆకట్టుకుంది. చాలా సీరియల్స్ లో నటించిన ఈమె యాంకరింగ్ కు కాస్త కొత్తే. అనసూయ,రష్మీలా సమీరా కూడా యాంకరింగ్ రంగంలో తనకంటూ ఓన్ ఐడెంటిటీ సంపాధించుకోవాలని అనుకుంది. కానీ ఇంతలోనే సమీరాకు ఊహించని షాక్ ఇచ్చింది అదిరింది షో.

ఇటీవలే రిలీజ్ అయిన అదిరిందో షో ప్రోమోలో సమీరా కనిపించలేదు. ఆమె ప్లేస్ లోకి యాంకర్ రవి.. అలానే నటి భాను శ్రీ వచ్చారు. సో దీని బట్టి చూస్తే ఇప్పటి నుంచి అదిరింది షోకి యాంకర్స్ గా రవి, భాను శ్రీ ఉండబోతున్నారు. యాంకర్ గా తనకంటూ ఓ క్రేజ్ సంపాధించుకుందాం అనుకున్న సమీరా పొట్టమీదా రవి, భానుశ్రీ కొట్టినట్లు అయింది. ఏది ఏమైన సమీరా ఆనందం మూడునాళ్ల ముచ్చటే అయిపోయింది. మరి రవి, భాను శ్రీలతో అదిరింది షో క్రేజ్ ఏ మాత్రం పేరుగుతుందో చూడాలి. ఇక మీరు కూడా ఆ ప్రోమో చూసేయండి.

https://youtu.be/hhPpBB70i1w

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -