Saturday, April 27, 2024
- Advertisement -

మెగాస్టార్ తో సంపత్ నంది మూవీ.. నిజమేనా..!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచారి సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. దీంతో పాటు చిరంజీవి బాబీ దర్శకత్వంలో మలయాళ లూసిఫర్ రీమేక్, అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ మూవీ వేదాళం చేయనున్నారు. ఆచార్య పూర్తవగానే బాబీతో సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మెగాస్టార్ లైనప్ లో డైరెక్టర్ సంపత్ నంది కూడా ఉన్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి.

సంపత్ నంది ఇటీవల చిరంజీవిని కలిసి ఒక కథ వినిపించారని, ఆ కథ నచ్చడంతో ఓకే చెప్పారని టాక్. తాజాగా సంపత్ నంది చిరంజీవితో కలిసి దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.’తనలాంటి ఎంతోమందికి దేవుడైన చిరంజీవిని కలవడాన్ని ఎప్పటికీ మరువలేను’ అంటూ ఆసక్తికర కామెంట్ పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ నేపథ్యంలో సంపత్ నంది తో చిరంజీవి సినిమా ఓకే అయ్యిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం పై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. సంపత్ నంది చిరంజీవి ని కలిశారు.. అంటే కచ్చితంగా సినిమా ఉంటుందని కొందరు అంటుండగా, ఆచార్య తో పాటు మరో రెండు సినిమాల్లో చిరంజీవి చేతిలో ఉన్నాయి కాబట్టి సంపత్ నందితో సినిమా ఉండకపోవచ్చునని మరికొందరు అంటున్నారు. వాస్తవం ఏంటో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Also Read : పవన్, మహేష్ మధ్యలో ప్రభాస్.. రంజుగా పొంగల్ పోటీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -