Saturday, April 20, 2024
- Advertisement -

చరణ్ కు విలన్ గా మారిన సప్తగిరి

- Advertisement -
Sapthagiri become a villain to Ram Charan

స్టార్ హీరోల సినిమాలు ఆడియో ఈవెంట్ లేకుండా డైరెక్ట్ గా పాటలు మార్కెట్ లోకి రావడం చాలా అరుదు. ధృవకు ఇలాగే చేస్తున్నాడు. ఇండస్ట్రీలో వినిపిస్తోన్న కథనాల ప్రకారం ధృవ ఆడియోకు మెయిన్ విలన్ సప్తగిరి అని అంటున్నారు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో వేడుకకు పవన్ వచ్చాడు.

సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో వేడకకు పవన్ రావడానికి అసలు కారణం వేరే ఉంది.. విషయం ఏంటంటే.. ధృవ ఆడియో వేడుకకు కూడా పవన్ ను ఆహ్వానించాలనుకున్నారు. కానీ పవన్ మాత్రం ధృవ ఆడియో వేడుకకు వచ్చేందుకు ఆసక్తి చూపించలేదని సమాచారం. సప్తగిరి వేడుకకు వచ్చి.. చరణ్ కు రాకపోతే అభిమానుల్లో లేనిపోని అనుమానాలు వచ్చేస్తాయి. మరోవైపు అన్నయ్య ఖైదీ నెం.150 ఆడియో వేడుకకి పవన్ వస్తాడనే ప్రచారం జరుగుతుంది. ఇక్కడ అన్నయ్యా.. అబ్బాయా అంటే చిరంజీవికే ఓటేస్తున్నాడు పవర్ స్టార్. అందుకే ధృవ ఆడియో వేడుక జరపకుండా డైరెక్ట్ గా పాటలు విడుదల చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -