పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు కెఎస్. రవీంద్ర(బాబీ) మీడియాతో సినిమా గురించి కాసేపు మెచ్చటించారు.
‘పవర్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బాబీ రెండో సినిమాకే పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో చేయడం విశేషం. తనకు ఈ సినిమా చేసే అవకాశం రావడంపై బాబీ స్పందిస్తూ… నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం పవర్ 2014 సెప్టెంబర్లో విడుదలైంది. అది రిలీజైన రెండు నెలల తర్వాత నాకు నిర్మాత శరత్ మరార్ ఫోన్ వచ్చింది.
పవన్ కళ్యాణ్గారితో సర్దార్ గబ్బర్సింగ్ చేస్తారా అని అడిగారు. ఆయన అలా అడగ్గానే నమ్మలేక పోయాను. సినిమా అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేవరకు నేను దాన్ని కలగానే భావించాను అన్నారు. తొలుత నాకు పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్టు రెడీ చేసి ఇచ్చారు. దాన్ని నేను అడాప్ట్ చేసుకున్నాను. అందుకు దాదాపు 5 నెలల సమయం పట్టింది.
2015లో ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలుపెట్టాం. ఈ ఏప్రిల్లో విడుదల చేస్తున్నాం. సినిమా పూర్తవ్వడానికి ఏడాది పాటు సమయం పట్టింది అన్నారు. పవన్ కళ్యాణ్గారు మంచి స్పాన్ ఉన్న కథ ఇచ్చారు. దానికి తగ్గట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉంటాయని బాబీ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి మనసు ఎంత మంచిదో నా కళ్ళతో చూసా అని బాబీ అన్నారు.