Wednesday, May 1, 2024
- Advertisement -

విలక్షణ దర్శకుడు, విలక్షణ హీరో కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ..!

- Advertisement -

తెలుగులో సహజ సినిమాల దర్శకుడు, విలక్షణ దర్శకుడు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు శేఖర్ కమ్ముల. ఆయన తన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా డాలర్ డ్రీమ్స్ కే పలు అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత ఆనంద్,గోదావరి, హ్యాపీడేస్ మంచి విజయం సాధించాయి. ఫిదా సినిమా ఆయన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆయన సినిమాలు చాలా సహజంగా సాగుతాయనే పేరు వచ్చింది.

అలాగే తమిళ హీరో ధనుష్ ప్రయోగాలకు పెట్టింది పేరు. ఆయన కెరీర్ లో ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలే ఉంటాయి. ఇటీవల ధనుష్ చేసిన అసురన్, కర్ణన్ మంచి ప్రయోగాత్మక సినిమాలు గానే కాకుండా మంచి విజయాన్ని కూడా అందుకున్నాయి. తాజాగా ధనుష్ నటించిన సినిమా జగమే తంతిరం ఇవాళ నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలైంది. ఈ సినిమాలో కూడా ధనుష్ ప్రత్యేక పాత్రలో నటించాడు.

Also Read: ఇద్దరు పెద్ద హీరోలతో శ్రీనువైట్ల మల్టీ స్టారర్​..!

ఇప్పుడు శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్లో ద్విభాషా ఓ చిత్రం తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా కేటగిరిలో చేయాలని ధనుష్ భావిస్తున్నారట. ధనుష్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన రఘువరన్ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్ లో మార్కెట్ పెంచుకునేందుకే ధనుష్ ఈ సినిమా చేస్తున్నాడని సమాచారం. విలక్షణ దర్శకుడు, విలక్షణ హీరో కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలోనే వీరి కలయిక సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ వచ్చే అవకాశం ఉంది.

Also Read: సూపర్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టిన యువ హీరో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -