టాలీవుడ్ లో తనకంటు ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో వరుణ్ సందేశ్. హ్యాపిడేస్, కొత్త బంగారు లోకం సూపర్ హీట్స్ సాధించి బాగా క్రేజ్ సంపాధించుకున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత వరుణ్ కి మంచి సక్సెస్ అయిన సినిమాలు రాలేదు. ఇక వరణ్ ఇప్పటివరకు 13 ప్లాపు సినిమాల్లో నటించాడు. వరుణ్ సందేశ్కు ఓ సీనియర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. అంతే కాకుండా.. చెసిన తప్పును మళ్లీ చేస్తే… ఈసారి వార్నింగ్ ఇవ్వడం కాదు. వేరొకటి జరుగుతుందని హెచ్చరించాడట.
మరి వరుణ్ సందేశ్కు వార్నింగ్ ఇచ్చింది ఎవరు ? ఆ సంఘటన జరిగింది ? ఆ కథ ఏంటో చూద్దాం. రెండున్నరేళ్ల క్రితం. మోహన్బాబుతో కలిసి వరుణ్ సందేశ్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు సాయంత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే.. హీరోలు వరుణ్, తనీష్లు, హాస్యనటుడు కిశోర్ ఒక గదిలో బెడ్పై విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో ఆ గదిలోకి వచ్చిన మనోజ్ ఎగిరి వాళ్లపై సరదాగా పడ్డాడట. వెంటనే మోహన్బాబు ఆ గదిలోకి ఎంటర్ అయ్యాడట.
వాళ్లందరినీ తన గదికి రమ్మన్నాడట. వెంటనే భయభయంగా ఆయన గదికి వెళ్లారు హీరోలు. ‘ఏమయ్యా.. మీరు కుక్కలా, పందులా లేక మనుషులా? అదేంటయ్యా.. అలా పడుకున్నారు. సినిమా నటుడంటే ఎలా ఉండాలి. డిగ్నిఫైడ్గా ఉండాలయ్యా. ఇది మళ్లీ రిపీట్ అయ్యిందా.. ఈసారి వార్నింగ్ ఇవ్వను’ అని మందలించారట. ఈ సంగతిని వరణ్ సందేశ్ రీసెంట్ గా ఒక టీవీ షోలో స్వయంగా చెప్పాడు.
Related