చిన్న యాంకర్ గా బుల్లితెరకు పరిచయం అయిన లాస్య.. ఆ తర్వాత స్టార్ యాంకర్ ఎదిగింది. లాస్యకు యాంకర్ రవి జత కావడంతో ఈ జంటకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత శ్రీముఖి ఎంట్రీ ఇవ్వడంతో లాస్య మాయమైపోయింది. ఆ టైంలో ఆమెపై చాలా రూమర్స్ కూడా వచ్చాయి. కానీ చాలా రోజుల వరకు గ్యాప్ తీసుకున్న లాస్య.. ఎవరూ ఊహించని విధంగా హీరోయిన్ గా మారి రాజా మీరు కేక అనే చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చింది.
ఆ షాక్ నుంచి బయటకు రాక ముందే తాను ఇష్టపడ్డ వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకొని మరో షాక్ ఇచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..తను నా సోల్ మేట్ మంజునాథ్..మరాఠీకి చెందిన వ్యక్తి అని డిటైల్స్ కూడా చెప్పింది. దీంతో..హీరోయిన్ గా మారి బిజీగా ఉన్న సమయంలో లాస్య ఇలా పెళ్లి పీటలెక్కడం ఏంటీ? అనే డౌట్ అందరికీ వచ్చింది. ఇంతకీ షడన్ గా లాస్య ఆ డెసిషన్ ఎందుకు తీసుకుందో తెలిసి చాలా మంది అవాక్కయ్యారు.
అసలు ఎవరీ మంజునాథ్..? ఏం చేస్తుంటాడు? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. దీంతో కొన్ని నిజాలు బయటకి వచ్చాయి. లాస్య చేసుకునే వ్యక్తి బడా బిజినెస్ మ్యాన్ అట. ఆయనకు ముంబాయిలో చాలా ఆస్తులు ఉన్నాయట. అందుకేమో ఆమె ఇలాంటి డెసిషన్ తీసుకుంది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మంజునాథ్ కు కొన్ని కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని తెలిసింది. మొత్తానికి తన తెలివితేటలు ఉపయోగించి పెద్దింటి అబ్బాయినే పట్టేసిందని మాట్లాడుకుంటున్నారు. ఇంకేముంది..కాస్ట్లీ మొగుడు దొరికాడు అని అందరు మాట్లాడుకుంటున్నారు.
Related