Friday, May 3, 2024
- Advertisement -

షాకింగ్…రేటు పెంచిన బాలయ్య!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ…ఇప్పుడు నిర్మాతల పాలిట కల్పవృక్షంలా మారాడు. అఖండ, వీరసింహారెడ్డి,భగవంత్ కేసరి ఇలా బ్లాక్ బాస్టర్ హిట్‌లతో హ్యాట్రిక్ కొట్టారు. ఈ మూడు సినిమాలు వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. దీంతో బాలకృష్ణ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

ఇక తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుండటంతో రెమ్యునరేషన్‌ని అమాంతం పెంచేశారట బాలయ్య. అఖండ సినిమాకు బాలయ్య తీసుకున్న రెమ్యునరేషన్ రూ.10 కోట్లు. ఇక తర్వాత వచ్చిన వీరసింహారెడ్డికి ఏకంగా రూ.14 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా తాజాగా వచ్చిన భగవంత్ కేసరికి సేమ్ కంటిన్యూ చేశాడు. భగవంత్ కేసరి సక్సెస్ తర్వాత నిర్మాతలు మరో రూ. 4 కోట్లు అదనంగా ఇచ్చారు.

అయితే తాజాగా తన రెమ్యునరేషన్‌ని రూ. 10 కోట్లు పెంచి ఏకంగా రూ.28 కోట్లు డిమాండ్ చేస్తున్నారట బాలయ్య. ప్రస్తుతం నాగవంశీ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో మూవీ చేస్తుండగా ఈ సినిమాకు రూ.28 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఎందుకంటే బాలకృష్ణ సినిమాలు థియేట్రికల్,నాన్ థియేట్రికల్, అన్ని రెవెన్యూ కలిపి దాదాపు రూ.150 కోట్లు రాబడుతున్నాయి. అందుకే రెమ్యునరేషన్‌ని పెంచారని టాక్ నడుస్తోంది. ఇక చిరు రూ.50 కోట్లు, రవితేజ రూ.24 కోట్లు,నాగ్ – వెంకీ రూ.12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాని సమాచారం. వీరితో పోలీస్తే బాలయ్య పెంచిన రెమ్యునరేషన్ తక్కువేనని ఆయన అభిమానులు చెబుతుండగా ఏదిఏమైనా బాలయ్య రెమ్యునరేషన్ పెంచారనే వార్త మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -