భరత్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచియం అయింది కైరా అద్వానీ.ఎం.ఎస్.ధోని సినిమాతో బాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ వరస సినిమాలు చేస్తు బిజీగా ఉంది.ఈ కైరా రామ్ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.తాజాగా కైరాకు సంబంధించి బీటౌన్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.కైరా అద్వానీ బాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి.
ఈ భామ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియాలో కథానాలు వినిపిస్తున్నాయి. సిద్ధార్థ్ తరచూ కియారాను కలుస్తుండడం పలుమార్లు కెమెరా కంటపడింది. తాజాగా కియారా పుట్టినరోజు వేడుకకు కూడా సిద్ధార్థ్ హాజరయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు గుప్పుమన్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రా గతంలో అలియా భట్ తో ప్రేమాయణం నడిపించాడు.వీరిద్దరు మనస్పర్థల కారణంగా విడిపోయారు.మరి కైరా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రాల ప్రేమ ఎక్కడి వరకు వెళ్లుతుందో చూడాలి.