- Advertisement -

శ్రీ విష్ణు..క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’

- Advertisement -

ఇటీవల రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘విష్ణు విన్యాసం’లో కనిపించిన శ్రీ విష్ణు, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘మృత్యుంజయ్’తో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. రేబా మోనికా జాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 6, 2026న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ డిజిటల్‌గా విడుదల చేశారు.

నిర్మాత సన్నీ గున్నం జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహిత మిత్రుడు. ట్రైలర్ విడుదల సందర్భంగా ఎన్టీఆర్ ఎక్స్ (ట్విట్టర్)లో భావోద్వేగభరితమైన పోస్టు చేస్తూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. “సన్నీ నా జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ముఖ్య భాగంగా ఉన్నాడు. మా 18 ఏళ్ల స్నేహంలో, అతనికి తన తండ్రి గున్నం గంగరాజు గారిలా ప్రత్యేకమైన కథలను గుర్తించే ప్రతిభ ఉందని గమనించాను. ‘మృత్యుంజయ్’తో అతను నిర్మాతగా అడుగుపెడుతున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు.

ట్రైలర్ ఆసక్తికరంగా సాగుతుంది. ఇందులో శ్రీ విష్ణు ఓ మిస్టరీని చేధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. క్రైమ్ బ్యూరోలో ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నిస్తాడు, కానీ అనుభవం లేకపోవడంతో తిరస్కరించబడతాడు. అయినప్పటికీ, తనదైన శైలిలో ఆ రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకుంటాడు. అతను ఏ మిస్టరీని చేధించబోతున్నాడు? ట్రైలర్‌లో కనిపించే పిల్లలు ఎవరు? వారితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం పెద్ద తెరపై తెలుస్తుంది.
లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -