సినిమా సినిమాకి గ్యాప్ మధ్య సూపర్ స్టార్ మహేష్ వెకేషన్కి వెళ్తారన్న సంగతి తెలిసిందే. గుంటూరు కారం తర్వాత మహేష్ – రాజమౌళి కాంబోలో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రారంభం అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల జపాన్లో రాజమౌళి మహేష్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు.
దీంతో త్వరలోనే సినిమా ప్రారంభం అవుతుందని ఆశీంచిన ఫ్యాన్స్కు నిరాశే. ఫ్యామిలీతో కలిసి మళ్లీ వెకేషన్కి వెళ్లారు మహేష్. సితార, గౌతమ్, నమ్రత కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్టులో వెళ్తున్న విజువల్స్ వైరల్గా మారాయి.
అయితే రాజమౌళి సినిమా మొదలైతే మహేష్కి వెకేషన్ అనే ఆప్షనే ఉండదు. అందుకే తన సరదాలను ఇప్పుడే తీర్చుకుంటున్నారట మహేష్. ఇక మహేష్ కెరీర్లో ఇది 29వ సినిమా కాగా భారీ అంచనాలు నెలకొన్నాయి.