రామ్ చరణ్ కెరీర్లో మరిచిపోలేని మూవీ మగధీర. 2009లో విడుదల అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 151 కోట్లు వసూళ్లు సాధించి తెలుసు సినిమా స్థాయిని పెంచింది. గీతాఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రంకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా రాజమౌళి దర్శకత్వం వహించారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్లో రామ్ చరణ్ హీరోగా మళ్లీ రాజమౌళి సినిమా చేస్తారని ఏడేళ్లుగా మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే వీరి కాంబినేషన్లో మూవీ ఇక రాదని ఫిల్మ్ నగర్ వాసులు అంటున్నారు. మగధీర మేకింగ్ సమయంలో రాజమౌళి పనితీరుని అల్లు అరవింద్ అభినందించక పోగా, అవమానించారని వెల్లడించారు. అందుకే ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేయకూడదని రాజమౌళి ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక రామ్ చరణ్తీ అనుభవం రాజమోళి కి గొప్ప పాఠం అయిందంట.
టాలీవుడ్ లో వచ్చిన కొత్తల్లో సినిమా అవ్వడం వల్ల చరణ్ నటించేందుకు చాలా ఇబ్బంది పడ్డాడని, అతనితో కావలసిన నటన రాబట్టుకోవడానికి రాజమోళి చాలా కష్టపడ్డాడని టాలీవుడ్ వర్గాలవారు అంటూన్నారు. సో రామ్ చరణ్ తో కూడా మూవీ చేయడని స్పష్టం చేశాయి. అందుకే మెగా ఫ్యాన్స్ రాజమౌళి, రామ్ చరణ్ కాంబోలో మళ్లీ మూవీ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
Related