సాధారణంగా త్రివిక్రం ఎవరితో అంత తొందరగా గొడవ పడడే మరి త్రివిక్రం కోపానికి బలైన నిర్మాత ఎవరు అఆ నిర్మాత రాధాకృష్ణనా అంటే కాదు కాదు వాళ్లిద్దరి మధ్య మంచి అవగాహన ఉంది అంటున్నారు.
మరి త్రివిక్రం ఏ నిర్మాత మీద కోపం పెంచుకున్నాడు అంటే ఆయనే అత్తారింటికి దారేది నిర్మాత బోగవల్లి ప్రసాద్. అత్తారింటికి దారేది సినిమా నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయట కాని బోగవల్లి ప్రసాద్ మాత్రం దర్శకుడు త్రివిక్రం, హీరో పవన్ కళ్యాణ్ కు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టాడట. ఈ వ్యవహారం ఫిల్మ్ చాంబర్ దాకా వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇక అందుకే త్రివిక్రం ఇక ఇలాంటి గొడవలు వద్దనుకుని కేవలం రాధాకృష్ణ నిర్మాణ సారధ్యంలోనే సినిమాలు చేస్తున్నాడు.. చేస్తాడు కూడా. రాధాకృష్ణ కూడా త్రివిక్రం లానే చాలా నెమ్మదస్తుడు. అందుకే వీరిద్దరికి కుదిరింది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి ఇప్పుడు అఆ. ఇలా మూడు సినిమాలు తీసి మూడు హిట్లు అందుకునేలా చేశారు. ఇక రాబోయే సినిమాలు కూడా త్రివిక్రం హాసిని అండ్ హారికా క్రియేషన్స్ బ్యానర్లోనే చేస్తాడని అంటున్నారు.