Friday, April 26, 2024
- Advertisement -

చిరు లేకుండానే మొదలైనా ’వేదాళం’ రీమేక్..?

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్నాడు.. అయితే ఈ సినిమా తరువాత చిరు చేయబోయే సినిమా పై కొంత అయోమయం నెలకొంది. వాస్తవానికి చిరు వివి వినాయక్, మెహర్ రమేష్, బాబీ సినిమాలను లైన్ లో ఉంచాడు.. అయితే వీటిలో ఏ సినిమా ఆచార్య తరువాత ఉంటుందనేది ఇంకా క్లారిటీ రాలేదు.. గత కొన్ని రోజులుగా చిరంజీవి తర్వాతి సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో ని లూసిఫర్ అనుకున్నారు.. కానీ ఇప్పుడు ఆ సినిమా కాదని అంటున్నారు.. ఆచార్య సినిమా తర్వాత మెహర్ దర్శకత్వంలోనే చిరు సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాని తెలుగులో ఐదేళ్ల తరవాత రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. 2021 దసరా లోపు ఈ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నా చిత్రబృందం ఇప్పటికే సినిమాకి సంబంధించి కొన్ని మాంటేజ్ షాట్లు చిత్రీకరించారని టాక్ వస్తుంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో మొదలవుతుందని అన్నారు.

కలకత్తాలో దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. కలకత్తా నేపథ్యంలో సాగే సినిమా కాబ్బటి మెన్న దసరాకు కలకత్తా వెళ్లి, అక్కడ ఉత్సవాలలో కొన్ని మాంటేజ్ షాట్లను షూట్ చేసుకొచ్చిందట చిత్రబృందం. ఆ షాట్లనే ఇప్పడు వేదాళం రీమేక్ లో వాడుకోబోతున్నారట. . అందుకే ముందుగానే కలకత్తా దసరా ఉత్సవాలను కవర్ చేసి జాగ్రత్తగా దాచి పెట్టుకున్నారు. అంతే కాదు సినిమాలో మెగా స్టార్ చిరంజీవి గుండు గెటప్ లో కనిపించబోతున్నారు. అందుకే చిరు గుండుతో లుక్ టెస్ట్ కూడా చేయించుకున్నారట. సినిమాలో కీర్తి సురేష్ చిరు సోదరిగా నటించనున్నది. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నారు.

Also Read

వింత జబ్బులతో బాధపడుతున్న సెలబ్రిటీలు వీరే..!

ఎన్టీఆర్ వాడే కార్లు, ఇల్లు చూస్తే షాకే..!

బాలీవుడ్ యంగ్ హీరోలు వాడే కార్లు ఇవే..!

బన్నీ ఇప్పటివరకు వదిలేసిన సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -