ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో రీ రిలీజ్ సినిమాల సందడి నెలకొంది. టాలీవుడ్లో బ్లాక్ బాస్టర్ సినిమాలు రీ రిలీజ్లో సత్తాచాటుతుండటమే కాదు కోట్లలో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
తాజాగా విజయ్, త్రిష జంటగా మహేష్ బాబు ఒక్కడు సినిమాకు రీమేక్ గా వచ్చిన చిత్రం గిల్లి. 2004లో రిలీజ్ అయిన ఈ చిత్రం తమిళ ఇండస్ట్రీకి షేక్ చేసింది. ఇక సినిమా విడుదలై 20 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఏప్రిల్ 20న గిల్లి సినిమాని భారీగా రీ రిలీజ్ చేశారు.
థియేటర్స్ లో ఆడియన్స్, అభిమానుల రెస్పాన్స్ అదిరిపోయింది. గిల్లి సినిమా చూస్తు ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా ఒకే రోజు ఏకంగా రూ.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. వీకెండ్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.