Saturday, April 20, 2024
- Advertisement -

మరి బాహుబలిని చంపింది ఎవరు?

- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ సినిమాతో తెలుగు సినిమా స్టామినా ను ప్రపంచాన్నికి చాటి చెప్పాడు. ఇటివలే ఈ సినిమాకి జాతీయ అవార్డ్ కూడా వచ్చిన విషయం తెల్సిందే. ఐతే ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న సినీ ప్రేక్షకులనే కాదు.. సాధారణ ప్రజానీకం కూడా మాట్లాడుకునేలా చేయటమే కాదు.. అదో హాట్ టాపిక్ గా మారింది.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయాన్ని కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ మొదలుకొని.. దర్శకుడు రాజమౌళి వరకూ పెదవి విప్పింది లేదు. తాజాగా ఈ విషయం మీద ఆసక్తికర మాట ఒకటి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి నోటి నుంచి వినిపించింది. ఇంతకీ ఆ విషయాన్ని చెప్పింది మరెవరో కాదు.. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయం మీద ఆయనో ఆసక్తికర వ్యాఖ్య చేశారు విజయేంద్రప్రసాద్ గారు.

బాహుబలికి జాతీయఅవార్డు వచ్చిన సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న సస్పెన్స్ కు తెర దించాలన్న మాటకు స్పందిస్తూ.. అసలు బాహుబలి చనిపోయాడని ఎందుకు అనుకుంటున్నారంటూ ఆయన కొత్త సమాధానం చెప్పుకొచ్చారు. ఇప్పడు మరో ప్రశ్న ప్రేక్షకుల్లో కలుగుతుంది అసలు కట్టప్ప బాహుబలిని చంపేశాడా? లేదా? అని. సో ఈ విషయం తెలియాలి అంటే బాహుబలి వచ్చే వరకు ఆగాల్సిందే.

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటే!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -