Friday, May 3, 2024
- Advertisement -

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటే!

- Advertisement -

బాహుబలి సినిమా పార్ట్‌1 విడుదలై రికార్డులు సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడోనని చాలా మంది సినీ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విదంగా చర్చించుకుంటున్నారు.

ఇదే అదునుగా ప్రతి ఒక్కరు ఎవరికి తోచింది వారు బాహుబలి పార్ట్‌2 కథ ఇదే అని సోషల్‌ నెట్‌వర్క్స్‌లో హల్‌చల్ చేస్తున్నారు. సినిమా విడుదల అయ్యేవరకు ఏది నిజమో ఏది అబద్దమో ఎవరికి తెలీదు. కానీ ఈ కథ మాత్రం బాహుబలి పార్ట్‌2 కి చాలా దగ్గరగా ఉంది.  

కథ:

పార్ట్ -1 లో క్లైమాక్స్ లో కట్టప్ప అమరేంద్ర బాహుబలి ని వెన్ను పోటు పోడిచానని చెప్పటం తో అక్కడ తో పార్ట్ 1 పూర్తి అవుతుంది. దాని తర్వాత కట్టప్ప మిగిలిన స్టోరీ శివుడు ( ప్రభాస్ ) కి చెబుతాడు. 

 

కాలికేయ రాజ్యం మీద గెలిచి విజయ జెండా ఎగరవేసిన మహిష్మతి రాజ్యానికి రాజు గా అమరేంద్ర బాహుబలి అవుతాడు. మరో వైపు కన్న కొడుకు (భల్లలా దేవా ) కి అన్యాయం జరిగింది అని బిజ్జల దేవ్ (నాజర్ ) కోపం తో రగిలి పోతారు. 

 అమరేంద్ర బాహుబలి పాలన లో మహిస్మతి రాజ్యం అంత భాగ్య బోగాలతో సంతోషం గా వుంటారు. మహిష్మతి రాజ్యానికి కి దగ్గర లో వున్నా కుంతలా రాజ్యం మీద చిన్న చిన్న రాజ్యాలు దండెత్తుతూ వుంటాయి . కుంతలా రాజ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకొనే దేవసేన (అనుష్క ) ఆ రాజ్యం లో దేవసేన చెప్పిందే చట్టం…శత్రువు బలగాలని ఒంటి చేత్తో మట్టి కరిపించే ధైర్య శాలి. ఒకానొక సంఘటన లో దేవా సేన ని అమరేంద్ర బాహుబలి చూడటం తో అక్కడ నుండి వాళ్ళ మధ్య ప్రేమ మొదలు అవుతుంది. మరో వైపు ఆ విషయం తెలుసుకున్న భల్లాల దేవా కూడా అనుష్క ని ఇష్టపడతాడు.  

ఆ విషయం బిజ్జల దేవ్ కి తెలుస్తుంది. బిజ్జలా దేవ్ (నాజర్ ) కుంతల రాజ్యానికి వర్తమానం పంపిస్తాడు.. ఆ విషయం తెలుసుకున్న దేవ సేన నిరాకరిస్తుంది. బిజ్జలా దేవా శివగామి తో నీ సోంత కొడుకు అయిన భల్లలా దేవా కి రాజు ని చేస్తావని ఆ రోజు అన్నావు…. కానీ మాట తప్పవు.. ఇప్పుడు మన కొడుకు కి ఇష్టమైన ఆ దేవసేన ని కూడా నువ్వు పెంచిన అమరేంద్ర బాహుబలి ఇష్టపడుతున్నాడు అని తన లో వున్న భాద ని శివగామి కి చెబుతాడు. యే నిర్ణయం తీసుకోవాలో అర్థం కానీ పరిస్థితి లో శివగామి ఆలోచన లో పడుతుంది. మరో వైపు మహిష్మతి రాజ్యం చేతి లో ఓడిపోయినా కాలికేయ తమ్ముడు నింజా (చరణ్ దీప్) పగతో రగిలిపోతుంటాడు. 

కుంతలా రాజ్యం నుండి విదేయుడు (సుబ్బరాజు ) వర్తమానాన్ని మహిష్మతి రాజ్యానికి తీసుకువస్తాడు. బిజ్జల దేవ పంపిన వర్తమానాన్ని కుంతల రాజ్యం దేవసేన తండ్రి తిరస్కరించినట్లు విధేయుడు చెబుతాడు. 

ఆ సభలో భల్లాల దేవ కోపం తో విధేయుడి మీద దాడి చెయ్యటానికి దిగుతాడు. ఆ సమయం లో అమరేంద్ర బాహుబలి విధేయుడి (సుబ్బరాజు) కి అడ్డ వచ్చి విధేయుడిని కాపాడతాడు. బిజ్జల దేవ ఆ సభ లో మళ్ళీ ఆ గొడవని రేపుతాడు. శివగామి అక్కడ జరుగుతుంది అంత చూస్తూ వుంటుంది. 

ఈ విషయం నా తల్లి శివగామి కి వదిలేస్తున్నాను అని అమరేంద్ర బాహుబలి అంటాడు… సభలో అంతా శివగామి తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తూ వుంటారు. 

శివగామి రాజ్యం కావాలా ….! ప్రేమ కావాలో …..! తేల్చుకోమని ఆ నిర్ణయాన్ని అమరేంద్ర బాహుబలి కి వదిలేస్తుంది. బాహుబలి చెప్పే సమాధానం కోసం అందరూ ఎదురుచూస్తూ వుంటారు. అమరేంద్ర బాహుబలి ప్రేమ కావాలని కోరుకుంటాడు…….బాహుబలి తీసుకున్న నిర్ణయం మహిష్మతి ప్రజలలో ఆందోళన మొదలు అవుతుంది. మహిష్మతి ప్రజలు అంత బాహుబలి రాజ్యం వదిలి వెళ్ళవద్దు అని వేడుకొంటారు…. మాకు బాహుబలి కావాలి అని. కానీ బాహుబలి మహిష్మతి ని వదిలి అరణ్య వాసం పడతాడు. 

 ఆ విషయం తెలుసుకున్న దేవసేన బాహుబలి కి తోడుగా వెళ్తుంది. బాహుబలి బౌద్ధ మటంలో వుంటూ అక్కడ వున్న వాతావరణం లో దేవసేన ని పెళ్లి చేసుకుని జీవనం కొనసాగిస్తూ వుంటాడు.  

మహిష్మతి రాజ్యం అంత భల్లాలదేవ (రానా ) ఆధీనం లోకి వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న కాలికేయ రాజ్యానికి రాజు అయిన నింజా (చరణ్ దీప్) మహిష్మతి రాజ్యం మీద దాడి చెయ్యటానికి సువర్ణ అవకాశం దొరుకుతుంది. మరో వైపు దేవసేన తల్లి అయ్యింది అని కుంతల రాజ్యం అందరికి తెలుస్తుంది. మరో వైపు మహిష్మతి రాజ్యం తో యుద్దానికి సిద్దం అవుతారు కాలికేయ సైన్యం అంత. ఆ యుద్ధం లో మహిష్మతి రాజ్యానికి ( భల్లలా దేవ్ ) రానా నాయకత్వం వహిస్తాడు. 

 ఆ యుద్ధ రణరంగ భూమి లో మొదటి రెండు దినాలు మహిష్మతి రాజ్యం లో సగం సైన్యం కాలికేయ చేతిలో నేల కూలుతారు….. ఇంకో రెండు దినాల్లో మహిష్మతి రాజ్యం కుప్ప కూలిపోతుంది అని తెలుసుకున్న శివగామి బాహుబలి కి వర్తమానం పంపిస్తుంది. 

ఆ విషయం తెలుసుకున్న బాహుబలి తిరిగి తన బార్య తో కలసి మహిష్మతి రాజ్యానికి వస్తాడు. కుంతలా రాజ్యం మహిష్మతి రాజ్యానికి సహాయం చేస్తుంది….  

మరో వైపు బిజ్జలదేవ (నాజర్ ) బాహుబలి మళ్ళి తిరిగి వస్తే తన కొడుకు ని రాజ్యం నుండి తప్పిస్తారు అని తెలిసి భల్లాల దేవ , బిజ్జలా దేవ అనుకుంటారు….. ఒక వైపు కాలికేయ చేతిలో ఓడిపోతాం అన్న భయం లేకుండా , తన తమ్ముడు తిరిగి వచ్చాడు అన్న భయం ఎక్కువ కనిపిస్తుంది. మహిష్మతి రాజ్యన్ని ఎల్లప్పుడు నమ్మిన బంటు గా పనిచేసే కట్టప్ప (సత్య రాజ్ ) ని రాజు చెప్పిందే వేదం అనుకుని బాహుబలి ని వెన్నుపోటు పొడవమని భల్లాల దేవ , బిజ్జల దేవ చెబుతారు. 

కాలికేయ సైన్యం తో యుద్ధం కొనసాగుతుంది… ఆ యుద్ధం లో కాలికేయ సైన్యం అంతా కుప్పకూలుతుంది. యుద్ధం జరుగుతున్న సమయం లో బాహుబలి ని కట్టప్ప వెన్నుపోటు పొడుస్తాడు. ఆ యుద్ధ భూమి లో బాహుబలి చనిపోతాడు….మహిష్మతి రాజ్యం అంత ఆ వార్త విని శోక సంద్రం లో వుంటారు…. దేవసేన 9 నెలలు గర్భవతి అవ్వటం వలన శివగామి అన్ని దగ్గర వుండి చూసుకుంటుంది…రానా బాహుబలి మీద వున్న కోపం తో మహిష్మతి రాజ్యం లో వున్న ప్రజలని హింసిస్తూ ఉంటాడు. తనని కాదని బాహుబలి ని పెళ్లి చేసుకున్న దేవసేన ని చెరసాల లో బంధిస్తాడు.

దేవసేన కి పుట్టిన బిడ్డని శివగామి పెంచుతుంది. బాహుబలి వారసుడి ని చంపాలని అనుకుంటాడు… కట్టప్ప ద్వారా ఆ విషయం శివగామి కి తెలుస్తుంది.  

బాహుబలి ని తన కొడుకు – భర్త కలసి చంపించారు అని శివగామి కి తెలుస్తుంది. భల్లాలదేవ బాహుబలి కొడుకుని చంపుదామని ప్లాన్ వేస్తాడు… 

ఆ విషయం తెలుసుకున్న శివగామి బాహుబలి కి పుట్టిన బిడ్డ తో రాజ్యం నుండి పారిపోతుంటే భల్లాల దేవా సైన్యం శివగామి ని చంపటానికి ట్రై చేస్తుంటారు … ఆ పోరు లో శివగామి ఆ పిల్లవాడిని ఒక గుడిసె వాళ్ళకి అప్పగించి చనిపోతుంది…..అక్కడితో కట్టప్ప బాహుబలి కి జరిగిన అన్యాయం గురించి శివుడి కి చెబుతాడు …. 

కట్ టు 

 భల్లాల దేవ శివుడు మీద పగతో రగిలిపోతుంటాడు…. తన కొడుకు (బద్రుడు ) ని చంపిన శివుడు మీద పగ తో వున్న భల్లాల దేవ , మరో వైపు తన భర్త (బాహుబలి) చావు కి కారణం అయిన భల్లాల దేవ ని చంపుతాను అని శబథం చేసిన దేవ సేన కసి తో వుంటారు…. 

శివుడు తనకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు… ఆ రాజ్యం లో కుంతల రాజ్యం తోడు అవుతుంది.. శివుడి కి నమ్మిన బంటు గా కట్టప్ప వుంటే , వాళ్ళకి ఆయుధాలు సరపరా చేసే వ్యక్తిగా కిచ్చా సుదీప్ సహాయం చేస్తాడు.  

మహిష్మతి రాజ్యానికి , శివుడి కి మధ్య జరిగే పోరు లో మహిష్మతి రాజు అయిన భల్లాల దేవ శివుడు చేతిలో ఓడిపోతాడు … మహిష్మతి రాజ్యం లో అందరూ చూస్తుండగా భల్లాల దేవ (రానా ) ని చితి మీద పేర్చి సజీవ దహనం చేస్తుంది…..ఆ బాధ తట్టుకోలేక బిజ్జల దేవ కొడుకు చితిని చూస్తూ కన్ను ముస్తాడు….

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -