జనసేన పార్టీ అధినేత.. టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆయన త్వరలోనే సినిమాలకు గుడ్బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. సినిమాల కంటే ప్రజాసంక్షేమమే తనకు ముఖ్యమని ఆయన ప్రకటించారు. జనసేనలో వక్తలు, కంటెంట్ రచయితలు, విశ్లేషకులుగా పనిచేసేందుకు ముందుకొచ్చిన అనంతపురం జిల్లా నూతన నాయకులతో పవన్ ఆదివారం సమావేశమయ్యారు.
దాదాపు 150 మంది నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఆ ప్రాంతంలోని సమస్యలపై పవన్ తో మాట్లాడారు. ఈ నెపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సినిమాల్లో నటించడం వాయిదా వేస్తానని ప్రకటించారు. అలాగే ఆరు నూరైనా అనంతపురం జిల్లా నుంచే పోటీచేస్తానని స్పష్టం చేశారు. తన తుది శ్వాస వరకూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరడుతానని చెప్పారు.
{loadmodule mod_custom,Side Ad 1}
తనను కొందరు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిని కాదంటూ విమర్శిస్తున్నారని, అసలు అలాంటివారు రాజకీయాల్లో ఎవరున్నారని ప్రశ్నించారు. ఒక్కో నాయకుడు కోట్ల రూపాయలు ఆర్జించి ఇంట్లో కూర్చున్నారని, ఇంట్లోనే ఉండి కోట్లు సంపాదించే ఏర్పాట్లు చేసుకున్నారని ఆరోపించారు. తాను మాత్రం తన కుటుంబం కోసం, తనపై ఆధారపడిన తన సిబ్బంది కోసం మాత్రమే సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}5N_HSGDFTEA{/youtube}
Related