Wednesday, May 1, 2024
- Advertisement -

‘ఓ మై గాడ్’ సీక్వెల్​.. హీరోయిన్​ ఎవరంటే?

- Advertisement -

గతంలో బాలీవుడ్​లో విడుదలై సంచలనం సృష్టించిన ‘ఓ మై గాడ్’ మూవీకి సీక్వెల్​ తీయబోతున్నట్టు బీ టౌన్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా 2012లో విడుదలైన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్, పరేశ్ రావల్ ముఖ్య పాత్రల్లో ‘ఓ మై గాడ్’ ని ప్రముఖ దర్శకుడు ఉమేశ్ శుక్లా తెరకెక్కించారు. ఈ మూవీ అప్పట్లో మంచి పేరుతెచ్చుకున్నది. తాజాగా దీనికి సీక్వెల్​ ప్లాన్​ చేస్తున్నారట మేకర్స్​. అయితే ఈ మూవీకి గత డైరెక్టర్​ ఉమేశ్​ శుక్లాను ఎంపిక చేయలేదని టాక్​. కొత్త డైరెక్టర్​తో ఈ చిత్రాన్ని తీయబోతున్నారు.

ఈ మూవీలో ఇటీవల వివాహం చేసుకున్న యామీ గౌతమ్​ ఈ సినిమాలో హీరోయిన్​గా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సీక్వెల్‌లో అక్షయ్ కుమార్ శ్రీకృష్ణుడిగా, పంకజ్ త్రిపాఠీ భక్తుడిగా కనిపిస్తాడట. పంకజ్ త్రిపాఠీకి జోడీగా యమీ గౌతమ్ నటించబోతున్నదట. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read:టాప్ డైరెక్టర్లని ‘అల్లు’ కు పోతున్న స్టార్ హీరో

ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ తో సినిమాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే జూలై,ఆగస్టులో కరోనా కేసులు తగ్గొచ్చన్న సమాచారంతో మూవీ మేకర్స్​ కొత్త సినిమాల కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక అక్షయ్​ నటించిన సుమారు అరడజను సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఓ మై గాడ్ తెలుగులో గోపాల గోపాల పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా, వెంకటేష్ భక్తుడిగా కనిపించారు.

Also Read: టాలీవుడ్ కి కోలీవుడ్ స్టార్ హీరోల క్యూ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -