గతంలో బాలీవుడ్లో విడుదలై సంచలనం సృష్టించిన ‘ఓ మై గాడ్’ మూవీకి సీక్వెల్ తీయబోతున్నట్టు బీ టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా 2012లో విడుదలైన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్, పరేశ్ రావల్ ముఖ్య పాత్రల్లో ‘ఓ మై గాడ్’ ని ప్రముఖ దర్శకుడు ఉమేశ్ శుక్లా తెరకెక్కించారు. ఈ మూవీ అప్పట్లో మంచి పేరుతెచ్చుకున్నది. తాజాగా దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే ఈ మూవీకి గత డైరెక్టర్ ఉమేశ్ శుక్లాను ఎంపిక చేయలేదని టాక్. కొత్త డైరెక్టర్తో ఈ చిత్రాన్ని తీయబోతున్నారు.
ఈ మూవీలో ఇటీవల వివాహం చేసుకున్న యామీ గౌతమ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సీక్వెల్లో అక్షయ్ కుమార్ శ్రీకృష్ణుడిగా, పంకజ్ త్రిపాఠీ భక్తుడిగా కనిపిస్తాడట. పంకజ్ త్రిపాఠీకి జోడీగా యమీ గౌతమ్ నటించబోతున్నదట. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read:టాప్ డైరెక్టర్లని ‘అల్లు’ కు పోతున్న స్టార్ హీరో
ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ తో సినిమాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే జూలై,ఆగస్టులో కరోనా కేసులు తగ్గొచ్చన్న సమాచారంతో మూవీ మేకర్స్ కొత్త సినిమాల కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక అక్షయ్ నటించిన సుమారు అరడజను సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఓ మై గాడ్ తెలుగులో గోపాల గోపాల పేరుతో రీమేక్ అయిన విషయం తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా, వెంకటేష్ భక్తుడిగా కనిపించారు.
Also Read: టాలీవుడ్ కి కోలీవుడ్ స్టార్ హీరోల క్యూ..!