Thursday, May 2, 2024
- Advertisement -

టాలీవుడ్ కి కోలీవుడ్ స్టార్ హీరోల క్యూ..!

- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరోల కన్ను ఇప్పుడు టాలీవుడ్ పై పడింది. వరుసగా ఆ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు తెలుగు సినిమాల్లో నటించేందుకు అంగీకారం తెలుపుతున్నారు. తెలుగు స్టార్ హీరోలందరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒక్కొక్క స్టార్ హీరోకి రెండు నుంచి మూడు సినిమాల లైనప్ ఉంది. దీంతో నిర్మాతలకు, దర్శకులకు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు హీరోలు దొరకడం లేదు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు కోలీవుడ్ స్టార్ హీరో లను సంప్రదిస్తున్నారు.

తెలుగులో కూడా మార్కెట్ పెంచుకునేందుకు అక్కడి హీరోలు టాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు అంగీకారం తెలుపుతున్నారు. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో నటించేందుకు తమిళ అగ్ర హీరో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా మైత్రీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో హీరోగా నటించేందుకు ఓకే చెప్పాడు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించి స్టార్డమ్ తెచ్చుకున్న తమిళ హీరో సిద్ధార్థ్ మళ్లీ టాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన అజయ్ భూపతి డైరెక్షన్ లో మహా సముద్రం మూవీలో నటిస్తున్నారు.

Also Read : రామ్ సినిమాలో విలన్ గా తమిళ స్టార్ హీరో..!

ఇప్పుడు తాజాగా జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ తెలుగు సినిమాలో నటించేందుకు అంగీకరించాడని తెలుస్తోంది. టాలీవుడ్ కు చెందిన ఒక పెద్ద బ్యానర్, పెద్ద డైరెక్టర్ కాంబినేషన్ లో ధనుష్ తో డైరెక్ట్ తెలుగు మూవీ చేసేందుకు ప్లాన్ జరుగుతోంది. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తరువాత ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో మరో హీరో కూడా నటించనున్నట్లు సమాచారం. కథ తెలిసి ఈ సినిమాలో నటించేందుకు టాలీవుడ్ కి చెందిన ఓ టాప్ హీరో కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

Also Read: క్యాప్సికమ్‌ తో బరువు తగ్గడం ఈజీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -