Sunday, May 12, 2024
- Advertisement -

డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం … క‌న్నుమూసి తెరిచేలోపు ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం…

- Advertisement -

మ‌నిషికి చావు ఎటువైపు నుంచి వ‌స్తుందో ఊహించ‌లేం. క‌న్ను మూసి తెరిచిన లోపు రెండు ప్రాణాలు గాల్లో క‌ల‌సిపోయాయి. హైదరాబాద్ నగరంలోని ఐడీఏ బొల్లారంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆటో డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఇద్ద‌రి ప్రాణాలు అనంత వాయువుల్లో క‌లిస‌పోయాయి.

వివ‌రాల్లోకి వెల్తే… సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన కనక మహాలక్ష్మి తన భర్తతో కలిసి ఐడీఏ బొల్లారంలోని జ్యోతి నగర్ కాలనీలో నివాసముంటున్నారు . నగరంలోని అరబిందో ఫార్మసీలో ఉద్యోగం చేస్తున్న లక్ష్మి.. మున్సిపల్ ఆఫీసు ముందున్న బస్టాప్‌లో రోజూ ఆటో ఎక్కి విధులకు వెళ్తారు.లక్ష్మి మరిది సైదిరెడ్డి తన బైక్‌పై తరచుగా ఆమెను బస్టాప్ వద్ద వదిలివెళ్తారు.

రోజూ మాదిరిగానే.. లక్ష్మి, సైదిరెడ్డి కలిసి బైక్‌పై వస్తున్నారు. మున్సిపల్ ఆఫీస్‌కు అతి సమీపానికి చేరుకున్న త‌రుణంలో బొల్లారంలో రోడ్డుపై టాటా ఏస్ వాహనాన్ని ఆపిన డ్రైవర్, వెనుక వస్తున్న ద్విచక్ర వాహనాన్ని గమనించకుండా డోర్‌ను తెర‌వ‌డంతో లక్ష్మి, సైదిరెడ్డి.. బైక్‌తో పాటు రోడ్డుకు కుడివైపున పడిపోయారు. అదే స‌మ‌యంలో వెనకాలే వస్తున్న టిప్పర్ వాహనం వారి మీద నుంచి వెళ్లిపోవడం ఘోరం జ‌రిగిఓయింది. రెప్పపాటులో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. టాటా ఏస్ వాహన డ్రైవ‌ర్ అక్క‌డి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసున‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -