- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలో భానుడి ప్రతాపం బాగా ఎక్కువ అయింది. అగ్ని గుండంలో లాగ మారిపోయిన తెలుగు రాష్ట్రాలు. వడదెబ్బకి నిన్న ఒక్క రోజే తెలుగు రాష్ట్రాలలో దాదాపు 23మంది మృతి చెందారు.. ఒకవైపు వాతావరణ అధికారులు ఎండలు ఎక్కువగా ఉండటంతో ఇంటి నుండి బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు..
కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మృత్యువాత పడుతున్నారు.. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈరోజే 24మంది చనిపోయారు.. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 8మంది, ఖమ్మంలో 6, అదిలాబాద్లో 3, కరీం నగర్లో 3, మహబూబ్ నగర్ లో 1 చొప్పున మృతి చెందారు..