తన నివాసం నుంచి బయటకురాకుండా కట్టడి చేయాలని ఎస్ఈసీ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమంటూ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలుచేశారు. పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని మంత్రి తరపు న్యాయవాది కోరగా..ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు తుది ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రపతి పర్యటనకు వెళ్లేందుకు అభ్యంతరం లేదని ఎస్ఈసీ తరుపు న్యాయవాది తెలిపారు.
పరిమిత కాలంపాటు అధికారం కల్గి ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్..ఏపీ ప్రభుత్వంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని..ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎస్ఈసీ వైఖరి చూస్తుంటే… పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తారనే అనుమానం వస్తోందన్న సజ్జల..వాటిని సైతం స్వాగతిస్తామని పేర్కొన్నారు.
శృంగార నటి సన్నీలియోన్ పై అక్కడ చీటింగ్ కేసు.. కారణం అదేనా?