వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ని అంతమొందించడానికి పక్కగా కుట్ర పన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం విమానాశ్రయంలో రెస్టారెంట్ నిర్వాహకుడుగా టీడీపీ నేత హర్షవర్దన్ ప్రసాద్ చౌదరి ఉండడం.. ఉత్తరాంధ్రలో పాదయాత్ర జరిగినన్ని రోజులూ ప్రతి గురువారం హైదరాబాద్కు వెళ్లేందుకు ప్రతిపక్ష నేత విశాఖ విమానాశ్రయానికి వస్తుండడం.. విమానాశ్రయం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) పహారాలో ఉండటంతో ఆయన్ను అంతమొందించడానికి విమానా శ్రయాన్నే వేదికగా చేసుకున్నారని చెబుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం ఠానేలంకకు చెందిన జనిపెల్ల శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త. శ్రీనివాసరావు బాబాయి నాగేశ్వరరావు ఆ గ్రామ తాజా మాజీ ఉప సర్పంచిగా పనిచేశారు. గత కొన్ని నెలలుగా శ్రీనివాసరావుకు తర్ఫీదును ఇచ్చి ప్రొఫెషనల్ కిల్లర్గా మార్చారని ఠాణేలంక వాసులు చెబుతున్నారు. తమకు సహకరిస్తున్న శ్రీనివాసరావు కుటుంబానికి ఆరునెలలక్రితమే పక్కా ఇంటిని మంజూరు చేసింది. ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం శ్రీనివాసరావు కుటుంబంతో దరఖాస్తు చేయించారు. అంతేగాక శ్రీనివాసరావుకు భారీ ఎత్తున సుఫారీ(నగదు) ముట్టజెప్పినట్లు ఆ గ్రామవాసులు చెబుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన జనిపల్లి శ్రీనివాస రావు కోడి పందేల్లో కీలక పాత్ర పోషించేవాడని తెలుస్తోంది. పందేల్లో వదిలే కోడి పుంజులకు కత్తులు కట్టడంలో అతను ఆరితేరినవాడని సమాచారం. సంక్రాంతి పండుగ వేళల్లో జరిగే పందేల్లో అతను ముమ్మిడివరంలో పుంజులకు కత్తులు కట్టేవాడని చెబుతున్నారు. అతనితో పాటు అతని తండ్రి తాతా రావు కూడా ఈ విద్యను వాడుతూ డబ్బులు సంపాదించేవారని చెబుతున్నారు. శ్రీనివాస రావు జగన్ పై దాడికి వాడిన కత్తిని స్థానిక వ్యాపారి నుంచి జనవరిలో కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.