- Advertisement -
ప్రధాని నరేంద్ర మోదీ ఎంత సేపు స్వచ్ఛ భారత్, మరుగుదొడ్లు అంటూ ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్నారని, అసలు దేశంలో చాలా మంది తిండి లేక బాధపడుతున్నారని ఆయనకు తెలుసా అని కేరళ సిపిఎం నేత, మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్.అచ్చుతానందన్ విమర్శించారు.
దేశంలో ప్రజలకు తిండే లేనప్పుడు మరుగుదొడ్లు కట్టుకుని ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేరళలో ఎన్నికలు ముగిసిన సిపిఎం అధికారంలోకి వస్తే అచ్చుతానందన్ ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ ప్రధానికి దేశంలో ఏది ప్రధానమో.. ఏది కాదో తెలియదన్నారు.