Saturday, May 4, 2024
- Advertisement -

రేపు జ‌గ్గుభాయ్‌ ఏం చెప్తాడు

- Advertisement -
  • విశాఖ‌లో స‌డ‌న్‌గా ర్యాలీ
  • రాజ‌కీయ అరంగేట్రానిక‌ని టాక్‌

అప్ర‌క‌టితంగా విశాఖ‌ప‌ట్ట‌ణంలో జ‌గ‌ప‌తిబాబు చేప‌ట్టిన పాద‌యాత్ర పెను సంచ‌లనంగా మారింది. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాడా.. లేదా నంది అవార్డుల విమ‌ర్శ‌ల‌కు నిర‌స‌న‌గా లేదా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టానికి ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌ని త‌దిత‌ర వాటి కోసం పాద‌యాత్ర చేప‌ట్టిన‌ట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ పుకార్ల‌న్నీ కొట్టివేస్తూ తాను చిన్న సినిమాల ప్రోత్సాహానికి తాను చిన్న పాద‌యాత్ర చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. అందాల స‌ముద్ర తీర‌మైన విశాఖ‌ప‌ట్ట‌ణంలో మంగ‌ళ‌వారం ఉద‌యం హ‌ఠాత్తుగా జ‌గ‌ప‌తి బాబు తెల్ల‌చొక్కా, లుంగీ వేసుకొని అచ్చ తెలుగు వేష‌ధార‌ణ‌లో పాద‌యాత్ర చేప‌ట్టారు. దీనికి అభిమానుల నుంచి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. తాను ఎందుకు పాద‌యాత్ర చేప‌ట్టానో రేపు హైద‌రాబాద్‌లో చెబుతా అని ప్ర‌క‌టించారు. ఈ యాత్ర రాజ‌కీయాల్లో ప్ర‌వేశం కోసం కాద‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు విడుద‌ల‌వుతున్న చిన్న సినిమాల ప్రోత్సాహానికి యాత్ర చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. ఈ యాత్ర‌పై ఎవ‌రూ ఏం ఊహించుకోవ‌ద్దు. కేవ‌లం మీ మీడియా టీఆర్‌పీ రేట్ల కోసం ఈ యాత్ర‌పై పుకార్లు చేయ‌వ‌ద్ద‌ని కోరారు. తాను చిన్న సినిమాల‌కు ప్రోత్స‌హిస్తాన‌ని వారికి మ‌ద్ద‌తు తెలుపుతూ యాత్ర చేశాన‌ని చెప్పారు. చిన్న సినిమాల‌ను ఆద‌రించండ‌ని కోరారు. సినీ ప‌రిశ్ర‌మ విశాఖ‌ప‌ట్ట‌ణానికి రావాలంటే ఇంకా ప‌ది, ఇర‌వ‌య్యేళ్లు అవుతుంద‌ని తెలిపారు. ప్ర‌త్యేక హోదా గురించి అడ‌గ్గా తన‌కు తెలియ‌ని విష‌యాలు తాను మాట్లాడ‌న‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లో కూడా యాత్ర చేస్తార‌ని టాక్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -