- Advertisement -
ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై చేసిన వాఖ్యలు సరైనవి కావని నటుడు‘డైలాగ్ కింగ్’ సాయికుమార్ అన్నారు. చంద్రబాబు ధర్మదీక్ష సందర్భంగా ప్రధాని మోదీపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన ఈవిధంగా స్పందించారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు.
కర్ణాటక శాసనసభా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సాయికుమార్ పోటీ చేస్తున్నారు. 2008 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి సాయికుమార్ ఓటమిపాలయ్యారు. మంగళవారం సాయికుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కోసం ప్రధాని మోదీ కాళ్లు పట్టుకొని న్యాయం చేయమని అడుగుతానని చెప్పారు.