- Advertisement -
మెగాహీరో వరుణ్ తేజ్ కూడా కొవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతకుముందు మంగళవారం ఉదయం హీరో రామ్చరణ్, తనకు కరోనా పాజిటివ్గా తేలినట్లు వెల్లడించారు.
చెర్రీ ప్రస్తుతం రెండు కీలక ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నారు. దీంతో పాటు చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ‘ఆచార్య’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిహారిక వివాహం కారణంగా కొంతకాలంగా ఆయన షూటింగ్లకు దూరంగా ఉంటున్నారు.
వరుణ్ తేజ్ ఎఫ్ 2 ఇచ్చిన జోష్ లో కొత్త సినిమాలు పట్టలెక్కిస్తున్నాడు. ఈ మధ్యనే తన చెల్లి నిహారిక పుట్టిన రోజును ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లి తరువాత ఇలాంటి వార్త వినడం అందరిలోను కొంత ఆందోళన రేకెత్తిస్తుంది.