Friday, May 24, 2024
- Advertisement -

భాజాపాలో చేరిన ప్ర‌ముఖ సినీన‌టి…

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌నున్న భాజాపా ఆదిశ‌గా ఆడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే వ‌ల‌స‌న‌ల‌ను ప్రోత్స‌హించిన కాషాయ‌ద‌ళం సినీ గ్లామ‌ర్‌పై దృష్టిపెట్టింది. దానిలో భాగంగా ముఖ సినీ నటి ప్రియారామన్ ను కాషాయ కండువా క‌ప్పారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ…రాజకీయాల్లో తన రోల్ మోడల్ నరేంద్ర మోడీ అని చెప్పిన ప్రియారామన్‌.. తనకు పదవులు ముఖ్యం కాదని.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించిన ప్రియారామన్‌ స్వతహాగా మలయాళీ. ప్రియారామన్‌ చేరికతో సౌత్‌లో పార్టీకి స్టార్‌ వాల్యూ వస్తుందని ఆ బీజేపీ భావిస్తోంది. ప్ర‌ధానంగా ఏపీలో ప్రియారామ‌న్‌ను రంగంలోకి దింపాల‌ని భాజాపా భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -