- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి జిల్లాలో ఎయిర్ఫోర్స్ శిక్షణ విమానానికి ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద కుప్పకూలింది. పైలట్ ప్యారాచూట్ సాయంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగాడు. నేలపై వాలిని పైలట్కు స్థానికులు సాయం చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన యోగేశ్ ఆ శిక్షణ విమానానికి పైలట్గా ఉన్నారు. స్వల్పంగా గాయపడ్డ అతన్ని హాస్పటల్కు తరలించారు.
హైదరాబాద్లోని హకీంపేట్ ఎయిర్ స్టేషన్ నుంచి బయలుదేరి.. బాహుపేట దగ్గరకు రాగానే కుప్పకూలింది. ప్రమాదానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కూలిన వెంటనే హెలికాప్టర్ కాలి బూడిదయ్యింది.