Friday, May 3, 2024
- Advertisement -

చైనా, భార‌త్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్‌..

- Advertisement -

అమెరికా, చైనా మ‌ధ్య ఇప్ప‌టికే వానిజ్య వివాదం ముద‌రి పాకాన ప‌డింది. ఇప్పుడు కొత్త‌గా మిల‌ట‌రీ వ్య‌వ‌స్థ చేరింది. ష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసిందంటూ చైనాకు చెందిన రక్షణ సంస్థపై ఆంక్షలు విధించిన అమెరికా.. ఇటు ఇండియాకు కూడా వార్నింగ్ ఇచ్చింది.

చైనా రక్షణ శాఖకు చెందిన ఎక్విప్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌పై ఆర్థిక ఆంక్షలను విధిస్తున్నట్లు అమెరికా గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మధ్య ఈ సంస్థ రష్యా నుంచి సుఖోయ్ సు-35 ఫైటర్ జెట్స్, ఎస్-400 సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్‌ను కొనుగోలు చేయ‌డంతో అమెరికా ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఇక భార‌త్‌కు కూడా వార్నింగ్ ఇచ్చింది. రష్యా నుంచి కొన్ని బిలియన్ల డాలర్లతో ఎస్-400 మిస్సైల్ వ్యవస్థను భారత్ కొనుగోలు చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే తుది చర్చలు పూర్తయ్యాయి. ఈ వ్యవహారంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. భారత్ పై కఠినమైన ఆంక్షలను విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

అమెరికా శత్రవులను ఎదుర్కొనే చర్యల్లో భాగంతా ఇతర దేశాల సంస్థలు, వ్యక్తులపై కఠినమైన ఆంక్షలు విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (కాస్టా)పై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న సంతకం చేశారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేసిన వెంటనే… చైనాపై అమెరికా ఆంక్షలు విధించింది.

రష్యాను దృష్టిలో పెట్టుకునే ఈ ఆంక్షలను విధిస్తున్నట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అమెరికా అధికారి తెలిపారు. ప్రత్యేకంగా ఏ ఒక్క దేశాన్నైనా అణగదొక్కాలనే ఉద్దేశంతో ఈ ఆంక్షలను విధించడం లేదని ఆయన చెప్పారు. రష్యా చర్యలను నియంత్రించేందుకే ఆంక్షలు విధిస్తున్నామని అన్నారు. అమెరికాను, అమెరికా మిత్ర దేశాలను ఇబ్బంది పెట్టేందుకు రష్యా యత్నిస్తోందని విమర్శించారు. ఎస్-400 లాంటి వ్యవస్థలను కొనుగోలు చేయడం అమెరికా కాస్టా చట్టానికి వ్యతిరేకమని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -