ఆనం వివేకానందరెడ్డి ప్రస్తుతం హాస్పిటల్ బెడ్పైన ఉన్నాడు. తీవ్ర అస్వస్థతో విషమ పరిస్థుతుల్లో ఉన్నాడన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ విషయం తెలుసుకున్న నారా లోకేష్ పరామర్శించడానికి ఆనం దగ్గరకు వెళ్ళాడు. చంద్రబాబు స్టైల్లోనే …..‘భయపడొద్దు……తిరిగొస్తారు….మంత్రి పదవులు కూడా చేపడ్తారు’ అని సానుభూతి చూపిస్తూ మాటలు చెప్పాడు. అయితే ఆనం వివేకానందరెడ్డి మాత్రం లోకేష్పై కాస్త ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. మామూలుగా కూడా ఆనం వివేకానందరెడ్డి కాస్త జల్సాపురుషుడు. మొహం మీదే మాట్లాడేసే టైప్ కూడా. 2014ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం కావడంతో ……వైకాపాలో చేరడానికి వైఎస్ జగన్ నో చెప్పడంతో ఆనం బ్రదర్స్ ఇద్దరూ టిడిపిలో చేరారు. చంద్రబాబు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి పార్టీలో చేర్చుకున్నాడు.
ఆ తర్వాత నుంచి ఆనం బ్రదర్స్ ఇద్దరూ కూడా జగన్పై తిట్లవర్షం కురిపించారు. స్థాయి దిగజార్చుకుని మరీ రోజాపై నీచనమైన భాషలో విమర్శలు చేశారు. చంద్రబాబు మెప్పుకోసం ఎంత చేయాలో అంతా చేశారు. జగన్ని వాడు వీడు అంటూ సంస్కారం లేకుండా మాట్లాడారు. అయితేనేం ఆనం బ్రదర్స్ జగన్ని తిట్టేలా ప్రోత్సహించిన చంద్రబాబు…….పదవి ఇచ్చే విషయంలో మాత్రం భూమా నాగిరెడ్డికి ఇచ్చినట్టుగానే హ్యాండ్ ఇచ్చాడు. భూమాకు చంద్రబాబు చేసిన అన్యాయం…అండ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని తప్పక గెలిపించాలని భూమాపై ఒత్తిడి తెచ్చిన వైనం….ఆ క్రమంలోనే భూమా మరణంలాంటి విషయాలపై పూర్తి అవగాహన ఉన్న ఆనం వివేకానందరెడ్డి ఇప్పుడు పరామర్శించడానికి వచ్చిన లోకేష్ బాబుతో స్ట్రెయిట్గానే ఎమ్మెల్సీ పదవి గురించి అడిగేశాడట. భూమానాగిరెడ్డి విషయంలో చేసినట్టుగానే చేస్తారా? లేక పార్టీలో చేరేలా ప్రలోభపెడుతూ మాట ఇచ్చినట్టుగా ఆనం బ్రదర్స్లో ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారా అని నిలదీశాడట ఆనం వివేకానందరెడ్డి. ఈ సారి అయినా చంద్రబాబు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి. మరోవైపు తెలంగాణా టిడిపిలో సీనియర్ నాయకుడైన మోత్కుపల్లికి కూడా గవర్నర్ పదవి ఆశ చూపించి వాడుకున్నాడు చంద్రబాబు. ఆ తర్వాత మోత్కుపల్లికి పూర్తిగా హ్యాండ్ ఇచ్చాడు. మరి ఆనం బ్రదర్స్ విషయంలో చంద్రబాబు మరోలా స్పందిస్తాడా? లేక యూజ్ అండ్ త్రో పాలసీనే ఫాలో అవుతాడా? అన్నింటికీ మించి జగన్ని, రోజాని తిట్టడం కోసం స్థాయి తగ్గించుకుని మరీ దిగజారుడు వ్యాఖ్యలతో రెచ్చిపోయినందుకైనా ఆనం బ్రదర్స్ని చంద్రబాబు కరుణిస్తాడా? చూడాలి మరి.