సోషల్ మీడియాలో సామాజిక పరిస్థితులపై అత్యంత క్రియాశీలకంగా ఉండే వ్యాపారవేత్త ఎవరంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆనంద్ మహీంద్రా.సామాజిక అంశాలపైనా, వర్తమాన వ్యవహారాలపైనా చురుకుగా స్పందించే ఆనంద్ మహీంద్రా చాలావరకు సరదా వ్యాఖ్యలతో అలరిస్తుంటారు. అయితే మొదటి సారి ఇంటర్నెట్లో ఓ వీడియో చూసిన ఆయనకు కన్నీళ్లు పెట్టుకున్నారు.
రెండు చేతులు లేని ఓ చిన్నారి కాళ్ల సహాయంతో ఆహారం తినేందుకు చేస్తున్న ప్రయత్నం తనలో ఆశావాదాన్ని పెంపొందిస్తుందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ‘ నా మనవడిని ఇటీవలే కలిశాను. కానీ ఈ వాట్సాప్ పోస్టు చూసిన తర్వాత కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాను. జీవితం అనేది ఎన్నో సవాళ్లతో, ప్రతికూలతలతో నిండి ఉంటుంది. అయితే ఆ బహుమతిని ఏ విధంగా మలచుకున్నామనే విషయం మన చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి ఫొటోలు చూసినపుడు నాలో ఆశావాదం పెంపొందుతుంది. నూతనోత్సాహాన్ని నింపుతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.