Saturday, May 4, 2024
- Advertisement -

జైరామ్‌ రమేష్‌, ఆనంద్‌ మహీంద్రా కలిసి పులి వీడియో షేరింగ్..!

- Advertisement -

సాధారణంగా పులులు, సింహాలు సరస్సులు, కొలనుల్లో జలకాలాడుతుంటాయి. కానీ.. ఓ పులి మాత్రం అచ్చం చిన్నపిల్లోడిలా టబ్‌లోకి దిగి స్నానం చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలోని కొడుగులో ఓ ఇంటి యజమాని ఏదో అవసరం కోసం తోటలో నీటితొట్టి ఏర్పాటు చేసుకున్నాడు. అటుగా వచ్చిన ఓ పులి ఆ తొట్టి దగ్గరకు వచ్చింది. దాదాపు రెండు నిమిషాలు నిడివి ఉన్న ఈ వీడియోలో టబ్‌ చుట్టూ పులి తిరుగుతూ నిశితంగా పరిశీలించింది.

అనంతరం అందులోకి దిగి జలకాలాడింది. మళ్లీ ఎవరైనా వస్తే పారిపోవడానికి అనువుగా ముందు కాళ్లను బయటికే ఉంచి స్నానం చేసింది. ఈ వింత సంఘటనను కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు.

దీన్ని చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా సైతం తెగ సంబరపడ్డారు. పైగా ఈవీడియోనూ రీట్వీట్‌ చేస్తూ.. ‘పులి ఇలా చేయడం తాను ఇదివరకెప్పుడూ చూడలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన.. కర్ణాటకలోని కొడుగులో గడిపిన తన చిన్ననాటి రోజులను’గుర్తు చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -