కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాన్కు బహిరంగలేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు ముద్రగడ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఈ లెటర్ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.ఉద్దానం బాధితుల విషయంలో బాబుతో పవన్ భేటీ అనంతరం ముద్రగడ లేఖ రాశారు.
ముఖ్య మంత్రి చంద్రబాబు ఉచ్చులో పడవద్దని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కి కాపు రిజర్వేషన్ నాయకుడు హితవు చెప్పారు.ఈ మేరకు ఆయన జనసేనానికి ఒక లే ఖ రాశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలు కమ్మరించి కాపులను మోసగించినవైనాన్ని ముద్రగడ లేఖలో వివరించారు. ఇప్పటికే ఎన్నో వర్గాల వారికి హామీల వర్షం కుమ్మరించారు. ఈ హామీలన్ని నీటి మీద రాతల్లాగే ఉన్నాయన్న విషయం గమనించాలని ఆయన పవన్ ను కోరారు.
అటువంటి అబద్దాలను నిజమని నమ్మి, మీరు వారితో ప్రయాణం చేసి మీ పరపతిని తగ్గించుకోవద్దని కోరుచున్నానండి,’అని ముద్రగడ జనసేన నాయకుడికి విజ్ఞప్తి చేశారు. కాపు రిజర్వేషన్లపై అబద్ధాల మీద అబద్ధాలను ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. లేఖ ఇది….

