- Advertisement -
జగన్ కేబినేట్లో బెర్త్లు దక్కని వారికి భారీ ఊరట లభించింది. మంత్రి వర్గ ప్రమాణస్వీకారినికి ముందే ప్రభుత్వ విప్ల జాబితాను ముఖ్యమంత్రి ప్రకటించారు. తన విధేయుడిగా ముద్రపడిన కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి ఏపీ సీఎం వైెస్ జగన్ చీప్ విప్ పదవిని కట్టబెట్టారు.మంత్రి పదవిని ఇవ్వని కారణంగా పార్టీ ఆవిర్భావం నుండి తన వెంట నడిచినందుకు శ్రీకాంత్ రెడ్డికి చీప్ విప్ పదవి వరించింది.
విప్లుగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, పార్థసారథి, కొరుముట్ల శ్రీనివాస్లను జగన్ నియమించినట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో దాదాపు అందరూ మంత్రి పదవి ఆశించినవారే. సామాజిక సమతూకంలో వీరికి మంత్రి పదవులు దక్కలేదు. దీంతో విప్లుగా ఈ ఐదుగురు కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు.