Tuesday, April 23, 2024
- Advertisement -

నింగిలోకి మారో వ్యూహం త్వరలో..!

- Advertisement -

భారత్​లో తొలి ప్రైవేటు రిమోట్​ సెన్సింగ్​ ఉపగ్రహం త్వరలోనే నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకోసం అంతరిక్ష అంకుర పరిశ్రమ ‘పిక్సెల్’..ప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూస్పేస్​ ఇండియా లిమిటెడ్(ఎన్​ఎస్​ఐఎల్​)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిప్రకారం వచ్చే ఏడాది ఆరంభంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన పీఎస్​ఎల్​వీ రాకెట్​ ద్వారా దీన్ని కక్ష్యలోకి ప్రవేశపెడతారు.

దేశంలో అంతరిక్ష కార్యకలాపాల్లో ప్రైవేటు సంస్థలు పాలుపంచుకోవటానికి వీలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇన్​-స్పేస్​’ పేరిట ఒక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేశాక కుదిరిన ఈ ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడింది. పిక్సెల్ ఉపగ్రహం ద్వారా అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఇస్రో ఛైర్మన్ కె.శివన్​ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

2023 జూన్​ నాటికి 30 ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పిక్సెల్ తెలిపింది. ఇవి 24 గంటల పాటు భూమిని పరిశీలిస్తుంటాయని పేర్కొంది. వ్యవసాయం నుంచి పట్టణ ప్రణాళిక పర్యవేక్షణ వరకూ అనేక అంశాల్లో సేవలను అందిస్తాయని వివరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -