Friday, March 29, 2024
- Advertisement -

తెలంగాణలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేడు (ఫిబ్రవరి 6) హైదరాబాద్ నగరానికి విచ్చేయనున్నారు. ఆయన శంషాబాద్ కు సమీపంలోని చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఆశ్రమంలో జరుగుతున్న రామానుజ స్వామి వారి సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు.

సీఎం తాడేపల్లి గూడెంలోని తన నివాసం నుంచి నేడు మధ్యాహ్నం 3.20 గంటలకు గన్నవరంలోని విమానాశ్రయానికి బయలుదేరతారు. అక్కడి నుంచి 3.50 గంటలకు బయలు దేరి 4.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్ లోని శ్రీరామ పురానికి చేరుకుంటారు. అక్కడి సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొంటారు. దాదాపు అక్కడ జగన్ మూడు గంటల పాటు ఉంటారని ఏపీసీఎంవో వర్గాలు వెల్లడించాయి. అనంతరం రాత్రి 9 గంటలకు అక్కడ నుంచి బయలుదేని తాడేపల్లి గూడెంలోని తన నివాసానికి చేరుకుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -