- Advertisement -
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ (72) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బసవతారం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఈ ఉదయం ఉరికి వేలాడుతున్న ఆయన్ను గమనించిన కుటుంబీకులు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకుని వచ్చే వరకే కోడెల శ్వాస ఆడటం లేదని వైద్యులు గుర్తించారు. వెంటనే అత్యవసర చికిత్స చేసినా, ఆయన గుండె స్పందించలేదని వైద్య వర్గాలు వెల్లడించాయి.