Friday, May 10, 2024
- Advertisement -

స్వాతంత్య్ర‌యం రోజును ద‌ళితుల‌ను అవ‌మానించిన మంత్రి..

- Advertisement -

ఏపీ మంత్రి ఆదినార‌య‌ణ రెడ్డి ద‌ళితుల‌పై చేసిన అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.ప్ర‌భుత్వంలో గైర‌వ ప్ర‌ద‌మైన మంత్రి హోదాలో ఉండి అడ్డు అదుపులేకుండా తన కావరాన్ని ప్రదర్శించారు. దళితులను అతిదారుణంగా కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు.

స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆదివారం వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించిన మంత్రి ఆదినారాయణరెడ్డి.. స్థానిక ప్రభుత్వాసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అనుచితవ్యాఖ్యలు చేశారు.దళితులు శుభ్రంగా ఉండరు. సరిగ్గా చదువు కూడా రాదు. కానీ వాళ్లే సూపరింటెండెంట్లు అయిపోతారు. ఏదో వెనుకబడ్డారని అప్పట్లో ఓ 10 ఏళ్లు అంబేద్కర్‌ వల్ల రిజర్వేషన్లు వచ్చాయి. 10 ఏళ్లు పోయాయి.. 70 ఏళ్లు పూర్తయ్యాయి. అయినా ఇంకా రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఎన్ని వసతులు కల్పించినా ఎస్సీలు మారలేదు. ఇంకా వెనుకబడ్డారంటే అందుకు కారణం వాళ్లే’’ అని మంత్రి అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు.

గ‌తంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దళితులను అవమానిస్తూ ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. దళితులపై మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచిత వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -