Wednesday, May 15, 2024
- Advertisement -

ఆంధ్రలో లక్ష చేరువలో కరోనా కేసులు…!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉగ్ర రూపం దాలుస్తుంది. రోజు రోజుకు వెల సంఖ్యలో పెరుగు తున్న కరోనా కేసులు. రాష్ట్రంలో చాలా చోట్ల కరోనా వ్యాప్తి చెందింది. ఉహించని రీతిలో రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో కొత్త గా 7627 పాజిటివ్ కేసులు నిర్దారణ అయినట్టు వైద్య శాఖ తెలిపింది. ఇప్పట్టి వరకు మొత్తం కేసులు 96298 కాగా… ఇందులో ఎపీ వాసులు 93403 అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2461… విదేశాల నుంచి వచ్చినవారు..434 మందికి కరోనా సోకింది. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం మృతులు సంఖ్య 1041 మందికి చేరింది. కోలుకున్నవారు 46301 మంది కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల 48956.

ఈ రోజు కొత్తగా కర్నూలు జిల్లా 1213, తూర్పు గోదావది జిల్లా 1095, పశ్చిమ గోదావరి జిల్లా 839, విశాఖపట్నం 784, అనంతపురం జిల్లా 734, చిత్తూరు జిల్లా 573, గుంటూరు జిల్లా 547, వైఎస్ఆర్ కడప జిల్లా 396, కృష్ణా జిల్లా 332, నెల్లూరు జిల్లా 329, శ్రీకాకుళం జిల్లా 276, విజయనగరం జిల్లా 247 మరియు ప్రకాశం జిల్లా లో 242 మందికి వచ్చినట్టు వైద్య శాఖ తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -