Thursday, May 16, 2024
- Advertisement -

చంద్రబాబు.. మళ్లీ నీతులు చెప్పారండోయ్..!

- Advertisement -

అసలు వ్యవహారం గురించి తప్ప అన్నింటి గురించి మాట్లాడేస్తూ ఉంటారు తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు. తను నిప్పులాంటి వాడినని.. అత్యంత నిజాయితీ పరుడిని అని.. అని చెప్పుకొనే బాబు గారు స్వయానా తన పార్టీ ఎమ్మెల్యే ఒకరు అవినీతి నిరోధక శాఖకు పట్టుపడితే..

తనను “బాస్” గా ప్రస్తావిస్తూ దొరికిపోతే.. బాబు గారు ఆ అంశం గురించి సరిగానే స్పందించనే లేదు. 

ఈ వ్యవహారం హాట్ టాప్ గా ఉన్న సమయంలో బాబు మాత్రం ట్విటర్ లో కొత్త పలుకులు పలుకుతున్నారు. నీతి.. నిజాయితీ.. క్రమశిక్షణ.. అంటూ చంద్రబాబు కొత్త సుద్దులు చెబుతున్నారు. ఏపీని 2029 కి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాను.. 2050 కళ్లా ప్రపంచానికే ఏపీని కేంద్రంగా చేస్తాను.. అంటూ బాబు గారు ప్రగల్బాలు పలికారు.

ఎప్పుడో జరగబోయేదాని గురించి తప్ప.. బాబు వర్తమానం గురించి అస్సలు మాట్లాడరు అని పేరు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బాబు విజన్ 2020 అంటూ గడిపేశారు. ఇప్పుడు అందరినీ 2029 వైపు చూడండి అని.. అప్పుడు ఏపీ నంబర్ వన్ అవుతుందని బాబు గారు చెబుతున్నారు. వర్తమానం గురించి మాట్లాడితే మాత్రం.. కష్టాలు, బడ్జెట్ లోటు గురించి ఏకరువు పెడతారు బాబు గారు.కాబట్టి అందరూ భవిష్యత్తు గురించి ఆశలు పెట్టుకొని.. వర్తమానాన్ని ఇలా గడిపేయాలనమాట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -