- Advertisement -

కూటమి ప్రభుత్వానికి ఏపీజీఈఎఫ్ అల్టిమేటం!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై APGEF తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉగాది పండుగ నాటికి పీఆర్సీ మరియు ఐఆర్ పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని సంఘం అల్టిమేటం ఇచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించింది.

సంఘం నాయకత్వం ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్‌ను నియమించలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన 9 ప్రధాన హామీల్లో ఒక్క హామీ కూడా అమలు కాలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.35 వేల కోట్ల వరకు ఉన్నాయని, అవి ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉంచినట్లు తెలిపారు. దీనివల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే పీఆర్సీ కమిషన్ నియమించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ప్రభుత్వం స్పందించకపోతే మొదట జిల్లాస్థాయిలో నిరసనలు చేపడతామని, అనంతరం రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల హక్కుల కోసం అవసరమైతే మరింత కఠినమైన పోరాటానికి సిద్ధమవుతామని APGEF అధ్యక్షుడు స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -