ఆనం బ్రదర్స్లలో ఒక రైనా ఆనం వివేకానందరెడ్డి వ్వవహారశైలి అందరకి తెలిసందే. నోటికి ఎంత వచ్చిందంటె అంతమాట్లాడేయడం ఆయనకు అలవాటే. ఆ అలవాటే ఇప్పుడు కొంప ముంచింది. తాజాగా వివేకానందరెడ్డికి కోర్టు షాక్ ఇచ్చింది. వైసిపి ఎంఎల్ఏ రోజాపై గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై కోర్టు సీరియస్ గా స్పందించింది. కోర్టుకుకూడా ఇరిటేట్ తెప్పించడంతో ఆరెస్ట్ వారెంట్ను జారీచేసింది.
అసలు విషయానికి వస్తే 2016 ఫిబ్రవరి 29న మీడియాతో మాట్లాడిన సందర్భంగా వివేకానందరెడ్డి… వైసీపీ ఫైర్ బ్రాండ్ – చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాను కించపరిచేలా – ఆమె పరువుకు భంగం కలిగేలా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆనం చేసిన వ్యాఖ్యలకు రోజా స్పందిస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా తర్వాత కూడా వివేకా రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. దాంతో రోజా తన పరువుకు భంగం కలిగిందని అంటూ పరువునష్టం దావా వేశారు
అయితే విచారణ సందర్భంగా వివేకా ఒక్కసారి కూడా కోర్టుకు హాజరుకాలేదు. దీంతో నేటి ఉదయం ఈ కేసు విచారణ మరోమారు జరగగా… కోర్టు న్యాయమూర్తి… వివేకా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రజా ప్రతినిధిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా… కోర్టు అందించిన నోటీసులను కూడా లెక్క చేయని వివేకాను అరెస్ట్ చేయాలంటూ అప్పటికప్పుడే అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. అసలే చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వివేకానందరెడ్డి తాజాగా కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంటు ఇబ్బందులు కలిగించేదే.