Thursday, May 16, 2024
- Advertisement -

చైనాలో అడ‌వుల‌ను త‌ల‌పించే నిర్మానాలు

- Advertisement -
Asia’s first vertical forest towers are being built in China

చైనాలో రోజు రోజుకీ కాలుష్యం పెరిగిపోతోంది. ఇప్టికే అనేక న‌గ‌రాల‌లో రెడ్ అలర్ట్ ప్ర‌క‌టించారు.కాలుష్యం పెరిగిపోతే భ‌విష్య‌త్తులో తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని కాలుష్యాన్ని త‌గ్గించేందుకు చైనా వినూత్న విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. పెద్ద భవంతులను నిలువెత్తు అడవులుగా మార్చే ప్రయత్నాన్ని మొదలు పెట్టింది. దీంతో ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్‌ స్టెఫానో బోయెరీ బృందంతో చర్చలు జరిపి చైనా అధికారులు వర్టికల్‌ ఫారెస్ట్‌ (నిలువెత్తు అడవి) లను అభివృద్ధి చేస్తున్నారు.

తూర్పు చైనాలోని నాన్‌ జింగ్‌ నగరం ఇప్పుడిప్పుడే కాలుష్యం కోరల నుంచి బయటపడుతుంది. ఇందుకు కారణం వర్టికల్‌ ఫారెస్ట్‌. తొలుత 110, 76 మీటర్లు ఎత్తున్న రెండు భవనాలను ప్రాజెక్టుగా తీసుకున్నారు. కేవలం ఈ రెండు నిర్మాణాలలో 900 చెట్లతో పాటు దాదాపు 20,000 మొక్కలను పెంచటం సాధ్యం చేసి చూపించారు. ఈ చెట్లు, మొక్కలు ప్రతిరోజూ దాదాపు వంద కేజీల కార్బన్‌ డై ఆక్సైడ్‌ ను గ్రహించి, 60 కేజీల వరకు ఆక్సిజన్‌ ను విడుదల చేస్తాయని భావిస్తున్నారు.

డిసెంబర్‌ లో చైనాలోని 24 నగరాలకు కాలుష్య ముప్పు తప్పదని రెడ్‌ అలర్ట్‌ రావడంలో ఆలోచించి వర్టికల్‌ ఫారెస్ట్‌ ప్రాజెక్టు మొదలుపెట్టారు. చైనాలో కాలుష్య నగరాలలో షాజియాహువాంగ్‌ ఒకటి. ఈ సిటీలోనూ ఆర్కిటెక్ట్‌ స్టెఫానో బోయెరీ పలు సంస్కరణలు తీసుకొస్తున్నాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తన బృందంతో కలిసి వర్టికల్‌ ఫారెస్ట్‌ లను డిజైన్‌ చేశాడు. కొన్ని నెలల్లోనే ఈ సిటీలో కాలుష్యాన్ని సగంమేరకు తగ్గించే పనిలో నిమగ్నమయ్యాడు. మరో రెండు వర్టికల్‌ ప్రాజెక్టులను నాన్‌ జింగ్‌ లో మొదలుపెట్టారు. 200 మీటర్లు, 108 మీటర్ల ఎత్తయిన భవంతులపై చెట్లు, మొక్కల పెంపకం ప్రాజెక్టును 2018లో పూర్తిచేయాలని ప్లాన్‌ చేశారు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కూడా వర్టికల్‌ ఫారెస్ట్‌ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ఇందుకుగానూ సింగపూర్‌ నుంచి సూపర్‌ ట్రీస్‌ ను విరివిగా దిగుతుగా చేసుకుంటున్నారు. సిడ్నీలోని వన్‌ సెంట్రల్‌ పార్కులో కొన్ని వర్టికల్‌ ఫారెస్ట్‌ లు దర్శనమిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా వర్టికల్‌ ఫారెస్ట్‌ లు ప్రారంభించి ఫారెస్ట్‌ సిటీలు ఏర్పడాలని పర్యావరణవేత్తలు ఆశిస్తున్నారు. భార‌త్‌లో ఢిల్లీకూడా కాలుష్యం అధిక స్థాయిలో ఉంది. ఇట్లాంటి ప్రాజెక్టులు ఇక్క‌డ కూడా మొద‌లు ప్రారంభిస్తే కాలుష్యం బారినుంచి కొంతైనా ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

Related

  1. జీశాట్ -9 ఉప‌గ్ర‌హం…..
  2. అగ్ని -2 ,బ్ర‌హ్మాస్ మిస్సైల్ల‌ను..విజ‌య‌వంతంగా ప‌రీక్షించిని భార‌త్‌
  3. మహిళా ఎమ్మెల్సీలకు ఆ వీడియోలు పంపిన బీజేపీ ఎమ్మెల్సీ
  4. బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తూ పాక్ రాయబారికి సమన్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -