- Advertisement -
తన మానాన తాను షూట్ చేసుకుంటోన్న పవన్ ను రిపోర్టర్లు అనసవరంగా కెలికారు. దీనికి ఎపి మంత్రులను వంకగా వాడుకున్నారు. అమరావతిలో జరిగే శంకుస్థాపనకు కామినేని,అయ్యన్నలు పవన్ సర్దార్ షూట్ నడుస్తోన్న నానక్ రామాగూడ రామానాయుడు స్టూడియోస్ కు వెల్లారు.
అయితే ఈ దృశ్యాన్ని కవర్ చేద్దామని వెల్లిన రిపోరట్లకు భంగపాటు తప్పలేదు.పవన్ బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించి మీడియా పై దాడికి దిగారు .ఈ సంఘటనలో రెండు కెమేరాలు ద్వంసమయ్యాయి. అయితే సర్దార్ లొకేషన్ ,గెటప్స్ ను రిపోర్టర్లు ఎక్కడ క్యాప్చర్ చేస్తారో ననే సందేహంతో పవన్ బౌన్సర్లు ఇలా చేసి ఉంటారని చెబుతున్నారు.
అంతా అంటున్నట్లు ఇది రిపోర్టర్ల పై దాడా.. అని అనడానికి వీల్లేదు. దీన్ని మనం పవన్ పై దాడిగా కూడా చూడవచ్చు.