శ్రీరామ జన్మభూమి మందిరం నిర్మాణ పనులు పూర్తయిన సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఆలయ శిఖరంపై లాంఛనంగా కాషాయ జెండాను ఎగురవేశారు. ఈ చారిత్రక ఘట్టం శ్రీరాముడు, సీతాదేవి దివ్య వివాహాన్ని సూచించే వివాహ పంచమి రోజున జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మరియు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు.
నేడు, అయోధ్య సాంస్కృతిక జాగృతికి సంబంధించిన ఒక చారిత్రక క్షణానికి సాక్ష్యంగా నిలుస్తోంది అన్నారు మోదీ. శతాబ్దాల నాటి గాయాలు మానుతుండగా, ప్రతి రామ భక్తుని హృదయం లోతైన సంతృప్తి, అపారమైన కృతజ్ఞత మరియు దైవిక ఆనందంతో నిండిపోయింది అన్నారు. ఐదు శతాబ్దాలుగా భక్తుల సుదీర్ఘ సంకల్పం నేడు నెరవేరుతోందని ఆయన నొక్కి చెప్పారు.
ఈ ధర్మ-ధ్వజం కేవలం ఒక జెండా కాదు…ఇది భారత నాగరికత పునరుజ్జీవనాన్ని సూచిస్తుంది. ఈ జెండా సంకల్పం, విజయం మరియు శతాబ్దాల కలలు నెరవేరడానికి ప్రతీక అని వివరించారు. ప్రాణం పోయినా మాట నిలబెట్టుకోవాలని ఈ జెండా ప్రేరణనిస్తుందని, విధి నిర్వహణ ఆధారిత ప్రపంచ సూత్రాన్ని ఇది తెలియజేస్తుందని ప్రధాని అన్నారు. బానిసత్వం నుంచి విముక్తి, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంభారత పౌరులు మానసిక బానిసత్వాన్ని అధిగమించి, స్వావలంబనను స్వీకరించాలని మోదీ పిలుపునిచ్చారు.
ప్రతి భారతీయుడి ఇంట్లో, గుండెలో శ్రీరాముడు ఉన్నాడు. మనం సంకల్పించుకుంటే, మానసిక బానిసత్వం నుంచి విముక్తి పొందగలం. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాకారం చేయకుండా మనల్ని ఏదీ ఆపలేదు అని ఉద్ఘాటించారు. భవిష్యత్తులో ఈ నగరం సంప్రదాయం మరియు ఆధునికత యొక్క సమ్మిశ్రణంగా మారుతుంది. ప్రణ ప్రతిష్ఠ తరువాత 45 కోట్లకు పైగా భక్తులు సందర్శించారు . అయోధ్య నైతిక విలువలు మరియు ఆధునిక అభివృద్ధిని మిళితం చేస్తూ ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే నగరంగా మారడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
