గోదావరి పుష్కరాలలో ఓ ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. బాహుబలి సినిమా చూసిన ఎవరికైనా రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్ర ఎప్పటికి గుర్తుకు ఉంటుంది.
ఎందుకంటే ఆ సినిమాలీ ఇది చాలా పవర్పుల్ పాత్ర. అలానే రమ్యకృష్ణ కూడా ఆ పాత్రలో జీవించేసింది.
ఈ సినిమాలో ఒక సీన్లో రమ్యకృష్ణ ఒంటి చేత్తో ఒక శిశువుని పట్టుకొని వాగు దాటిస్తుంది. మరొక సీన్లో ఇద్దరు పిల్లలను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. అయితే ఇది సినిమా, ఇలాంటి సీన్స్ నిజ జీవితంలో చూడటం చాలా కష్టం. కానీ దీనికంటే పవర్పుల్ సీన్ గోదావరి పుష్కరాలలో కనపడ్డాయి. రాజమండ్రిలో ఒక తల్లి బిడ్డను వాటర్లో నిలబడి ఒంటి చేత్తో పైకి ఎత్తి చూపే దృశ్యం కనిపించింది.
ఇది చూసిన అక్కడి భక్తులు కొందరు అవాక్కయ్యారు. మరి కొందరు ఆమెకి జాగ్రత్తలు చెప్పారు. ఇది నిజ జీవితం సినిమా కాదు, ఇలాంటివి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని ఆమెకు అక్కడివారు బోదించారు.